Saturday, October 22, 2011

ఏమైపోతిని ఏమైపోతిని ఈ క్షణమూ
నేను శూన్యమై జగము మాయమై
ఒళ్ళు మరచి కళ్ళెదుట నిలిచినదొకటే
పాటా పల్లవి ఒకటి వెనక మరొకటి పాటా పల్లవీ................

అక్షరాలు ఏర్చి కూర్చి అప్సరసల పదాలల్లి
సుకుమారపు భావాలను ఊపిరులను ఊది ఊది
పద సంపద చక చకమని  పరుగులెట్టు గోదారల్లే
ప్రవహించటమే ఉనికిగా ఊపిరిగా నేనుగా.....

ఆకసాన మబ్బుతునక నీడవోలే నడయాడగానె
ఏ కొసనో పదిలంగా దాచుకొన్న అక్షరాల విత్తనాలు
చిరుజల్లుగా పెను వానగా వెదజల్లు వేడుకలు ఆగి దాగి
 ఆపై నునులేత పచ్చికలై  మొలకలుగా తలలెత్తే క్షణాన
 నా పసికూనలు పాటల పాపలు బుడి బుడి నడకల
నాలుగు వీధులు నడచినప్పుడు .. నాలుగు చెరగుల పలికినప్పుదు
పాటలోని పాట వెంట ప్రాణవాయువై రాగ తేజమై భావ యుక్తమై
ఏ దరికో ఏ హృదికో ఏ అనంత లోకాలకొ తరలిపోవు వేళ

No comments: